శివాభిషేకాల్లో ఎమ్మెల్యే గాంధీ దంపతులు

నమస్తే శేరిలింగంపల్లి: సృష్టి స్థితి లయకారుడు పరమశివుడని, ఆయన దర్శనంతో సర్వపాపాలు హరిస్తాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మియపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ శివాలయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సతీమణి శ్యామల దేవి కుటుంబ సమేతంగా శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినమని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శివున్ని ప్రార్థించినట్లు చెప్పారు. శివరాత్రి నాడు వాడ వాడల రోజు వారీ ఉపవాస దీక్షలు, జాగరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో శివ పూజలు చేయడం జరుగుతుందని అన్నారు‌. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

శివలింగానికి అభిషేకాలు చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here