నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ వడ్డెర బస్తీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వడ్డెర బస్తీ వాసులు మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి వినతి పత్రం అందజేశారు. రాజీవ్ నగర్ వడ్డెర బస్తీ కాలనీ లో అసంపూర్తిగా మిగిలిన రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దశల వారీగా అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ వడ్డెర బస్తీ కాలనీ వాసులు బాలరాజు, సాయి ,నర్సింహ, దశరథ్, మల్లేష్, పాండు, మల్లేష్, కుమార్, అర్జున్, పెంటయ్య, నరేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.