జీహెచ్ఎంసీ ‌ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను, పలు అభివృద్ధి పనులను వెంటనే చేపట్టేలా చూడాలని స్థానిక‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఈఈ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. డివిజన్ లో పలు చోట్ల చేపట్టాల్సిన డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. నల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఈ సునిల్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, లక్ష్మణ్ యాదవ్, పి.నర్సింహారెడ్డి, రమేష్ తధితరులు పాల్గొన్నారు‌.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here