ఫాస్టర్లకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యం ఇస్తూ లౌకిక రాష్ట్రంగా ముందుకు సాగుతోందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాస్టర్లకు సీఎం కేసీఆర్ పంపిన క్రిస్మస్ కానుకలను రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలను సమదృష్టితో చూస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండగకు‌ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కానుకలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. గతేడాది కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకలను అధికారికంగా జరుపలేకపోయామని అన్నారు. క్రిస్టియన్ సోదరీసోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, పాస్టర్ డానియల్, హేమలత, పౌల్, లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, రమేష్, పి.నర్సింహ రెడ్డి, పాస్టర్ బృందం తదితరులు పాల్గొన్నారు.

క్రిస్మస్ కానుకలను అందజేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here