ఇండ్లస్ బ్యూటిఫుల్ మైండ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండ్లస్ బ్యూటిఫుల్ మైండ్స్ హాస్పిటల్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ అడిషనల్ డిజిపి డా. డీటీ నాయక్, మాజీ శాసన సభ్యులు నల్లు ఇంద్రసేన రెడ్డి, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు, డా. రామ్ సుబ్బారెడ్డి, డా. ఇండ్ల దీప్తి రెడ్డి, హాస్పటల్ యాజమాన్యం పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here