-సంతాపం వ్యక్తం చేసిన కార్పొరేటర్లు పూజితా జగదీశ్వర్ గౌడ్ దంపతులు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల జయరాజ్ యాదవ్ శనివారం మృతిచెందారు. రెండు వారాల క్రితం జయరాజ్ యాదవ్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వగా కుటుంబ సభ్యులు జూబ్లిహిల్స్ అపోలో దవఖానాకు తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన కోమాలోకి వెళ్లాడు. కాగా శనివారం మద్యాహ్నం జయరాజ్ యాదవ్ మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారు. కాగా జయరాజ్ యాదవ్ మృతిపట్ల హఫీజ్ పేట్, మాదాపూర్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ దంపతులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.