బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన‌ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ప్రజలకు చేయూతనందిస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 66 వేల చెక్కును మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. పేద ప్రజలకు ఆపదలో అత్యవసర చికిత్స కోసం వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, రాజు ముదిరాజ్, హఫీజ్ పేట్ బీసీ సెల్ అధ్యక్షుడు కనక మామిడి నరేందర్ గౌడ్, శ్యామ్, షేక్ సాబేర్, రాధాకృష్ణ, వెంకటేష్ ముదిరాజ్, పాండు, శ్రీకాంత్ ముదిరాజ్, అజీమ్, ఖాజా, సుదేశ్, ఇమ్రాన్, కాసిం తదితరులు ఉన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేస్తున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here