పీజేఆర్ స్టేడియంలో ముగిసిన హాకీ శిక్షణ శిబిరం – క్రీడాకారులకు ట్రాక్ సూట్లు అందజేసిన హోప్ ఫౌండేషన్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధి పాటుపడుతుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలంగాణ హాకీ చైర్మెన్ కొండా విజయ్ తెలిపారు. తెలంగాణ హాకీ మహిళ సీనియర్, జూనియర్ జట్ల శిక్షణ క్యాంపు కార్యక్రమం హోప్ ఫౌండేషన్, హాకీ రంగారెడ్డి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పిజెఅర్ స్టేడియంలో నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో హాకీ సీనియర్ టీం, జూనియర్ టీంలను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.

జాతీయ టోర్నమెంట్ కు ఎంపికైన హాకీ క్రీడాకారులను సన్మానిస్తున్న కొండా విజయ్

ఈ సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ జాతీయ మహిళ హాకీ పోటీల్లో తెలంగాణ హాకీ మహిళ జట్టు తన సత్తా చాటాలని సూచించారు. సీనియర్ హాకీ జాతీయ పోటీలు ఉత్తర ప్రదేశ్ జాన్సీ పట్టణంలో 19 నుండి 31 వరకు నిర్వహించే హాకీ జాతీయ టోర్నమెంట్ కు తెలంగాణ హాకీ జట్టు ను ఎంపిక చేశారు. సీనియర్ జట్టు కెప్టెన్ గా శృతి, వైస్ కెప్టెన్ గా మాధూరి రెడ్డి తో పాటు మెత్తం 18 క్రీడాకారులతో టీం సభ్యులను నియమించారు. జూనియర్ జాతీయ టోర్నమెంట్. ఈ నెల 20 నుండి 30 వరకు జార్ఖండ్ లో హాకీ పోటీలు నిర్వహించుచున్నట్లు తెలిపారు. జూనియర్ హకీ కెప్టెన్ గా అంజలి, వైస్ కెప్టెన్ గా అపర్ణతో పాటు 18 క్రీడాకారుల సభ్యులను ఎంపిక చేశారు. అనంతరం టీం సభ్యులను హోప్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మానంతో పాటు ట్రాక్ సూట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి హకీ సెక్రటరీ భాస్కర్ రెడ్డి తో పాటు తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ టోర్నమెంట్ కు ఎంపికైన తెలంగాణ హాకీ టీం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here