వివేకానంద నగర్ డివిజన్ లో ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మం

వివేకానంద నగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని వెంకటేశ్వరనగర్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ నవీన్ రావు, కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావులు డివిజన్ లో పర్యటించి ఓటరు నమోదు పత్రాలను స్వీక‌రించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..డిగ్రీ జిరాక్స్ మెమో గానీ, ప్రొవిజన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటరు కార్డు/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్ /కరెంట్ బిల్లు/ ఫోన్ బిల్లు తదితర అడ్రస్ ప్రూఫ్‌ల‌తోపాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, సెల్ నంబర్, ఈ మెయిల్ తో ఫాం నం 18 దరఖాస్తు నింపి సంతకంతో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రిస్తున్న ఎమ్మెల్సీ నవీన్ రావు, కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు

ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టాలని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మనమందరం పని చేయాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు డివిజ‌న్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను స్వీక‌రిస్తున్న ఎమ్మెల్సీ నవీన్ రావు, కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు

2017 సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫాం 18)తో పాటు ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యులు వెంకటస్వామి సాగర్, పర్వత సతీష్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు జితేందర్ చారి, శ్రీనివాస్, సూర్య ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్, సందీప్, శేఖ‌ర్, జై కుమార్, రమణ రెడ్డి, నారాయణ, స్వామి, రమ్య, అంజి రెడ్డి, మీనా, ఇంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here