మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు చేయించుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పత్రాలను శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ టి.వెంకన్నకి అందజేశారు.
ఈ సందర్బంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేయించుకున్నానని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరును నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు తమ పేరుని కచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని, గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2017 నవంబర్ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఓటర్ లిస్టు లో తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులేనని, కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.