విశ్వకర్మల‌ అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి: కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: విశ్వకర్మల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి ‌విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం‌ చందానగర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో విశ్వకర్మ‌ జయంతి ఉత్సవాలు‌ ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వకర్మలను ఉద్దేశించి మాట్లాడారు. విశ్వకర్మల సంక్షేమానికి తమవంతు సహకారం‌ ఎప్పటికీ ఉంటుందన్నారు. 20 మంది వృత్తి దారులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ‌ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చారి, ఉపాధ్యక్షుడు సత్యప్రణయ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కమిటీ సభ్యులు శంకరాచారి, మాణిక్యం, మల్లేష్, కూషాచారి, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

విశ్వకర్మ‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here