లింగంపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి హనుమాన్ దేవాలయంలో అఖిల భారత యాదవ మహాసభ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శేరిలింగంపల్లి అధ్యక్షుడు కొయ్యడ బాబు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యాదవ మహాసభ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే పాఠశాలలో భగవద్గీత పాఠాలు బోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం ఉపాధ్యక్షుడు పాశం రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి అందెల సత్యనారాయణ యాదవ్, కార్యదర్శి ఎం. శ్రీశైలం యాదవ్, యువజన విభాగం జి. రవి యాదవ్, మనోహర్ యాదవ్, బాలరాజు యాదవ్, సంఘం పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

లింగంపల్లి ‌హనుమాన్ దేవాలయంలో‌ శ్రీ కృష్ణునికి పూజలు చేస్తున్న యాదవ సంఘం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here