పేద వృద్ధురాలు అంత్యక్రియలకు దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆర్థిక సాయం

మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్

ఆల్విన్ కాలని(నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో మృతి చెందిన మహిళ అంత్యక్రియలకు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ సూచన మేరకు డివిజన్ యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ శివమ్మ కాలనీ లో నివాసముండే కోట మైసమ్మ(65) అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.. ఈ నగదు యువ నాయకులు రామకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు రాజేష్ చంద్ర, నాయకులు గంగాధర్, ప్రసాద్, సురేష్, రేఖ, జయ ప్రకాష్ తదితరులు ఉన్నారు..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here