హ‌ఫీజ్‌పేట్‌లోని ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని సంద‌ర్శించిన మియాపూర్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హఫీజ్‌పేట్‌లోని ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని మియాపూర్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. క‌రోనా టెస్టులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ త‌దిత‌ర సేవ‌ల గురించి కేంద్రం వైద్యాధికారి డాక్ట‌ర్ వినయ్‌బాబుని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌జ‌ల నుండి తీవ్ర ఒత్తిడి వ‌స్తున్నప్ప‌టికి ఏ ఆటంకాలు లేకుండా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొనసాగిస్తున్నామ‌ని, ప్ర‌తి రోజు దాదాపు 500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్న‌ట్టు డాక్ట‌ర్ విన‌య్‌బాబా తెలిపారు. అంద‌రితో పాటు మియాపూర్ డివిజ‌న్ నుంచి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు స‌హ‌కారం అందించాల‌ని కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్ర‌కాంత్ వారిని కోరారు.

వైద్యాధికారి డాక్ట‌ర్ విన‌య్‌బాబుతో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌లపాటి శ్రీకాంత్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here