నమస్తే శేరిలింగంపల్లి: జెటిఎంఐ గ్రూప్స్ అధినేత జెరిపేటి జైపాల్ పేద ప్రజలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. సోమవారం ఆయన తనయుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జెరిపేటి రాంచందర్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని చందానగర్లోని జెరిపేటి జైపాల్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.






