హఫీజ్‌పేట్ సాయి నగర్‌లో ఓటరు అవగాహన సదస్సు

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో మంగళవారం ప్రత్యేక ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్న ఆయన, ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు. మన ఓటు – మన భవిష్యత్తు అనే సందేశంతో కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here