శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం కోసం కొనసాగుతున్న నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా ఎంవీఆర్ గ్రూప్ అధినేత మూలవెంకటేష్ గౌడ్ రామ మందిర నిర్మాణం కోసం రూ.1.10 లక్షల నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో లింగం, శ్రీధర్, అంజన్ కుమార్ గౌడ్, కె నరేందర్ రెడ్డి, మూల సుధాకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మూల అనిల్ గౌడ్ పాల్గొన్నారు.






