అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయండి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికలు సిద్ధం చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ని జోనల్ కార్యాలయంలో కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ కి బొకే అందిస్తూ..

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, ఆ దిశగా కృషి చేయాలని వినతిపత్రాన్ని అందించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here