ప్రభుత్వ విప్ గాంధీ ని కలిసిన శ్రీ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘం సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. అయితే కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ శ్రీ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘం సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు. కాలనీలో రోడ్లు, తాగునీటి వసతి, వీధి దీపాలు, మౌలిక వసతులు కలిపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి , శ్రీ విగ్నేశ్వర శెట్టిబలిజ సంక్షేమ సంఘం సభ్యులు ప్రెసిడెంట్ వెంకటేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ ధనుంజయ్, జనరల్ సెక్రటరీ పెద్దిరాజు, ట్రెజరర్ యేసు బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రావు, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ గోపాల్ కృష్ణ, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here