ఓట్ల కోసం.. బిసిలను మోసం చేయడానికే బిసి బంధు

  • ఓబిసి మోర్చ ఆధ్వర్యంలో ధర్నా
  • 2014 ఎన్నికలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: బిసి లను దగా చేయనికి ఎన్నికల సమయంలో కేసిఆర్ మరో కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ వద్ద ఒబిసి మోర్చ జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒబిసి నాయకులు గడీల శ్రీకాంత్ గౌడ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వ సత్యనారాయణ , సురభి రవీంద్ర రావు, సీనియర్ నాయకులు కొరదాల నరేష్ , అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావుతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. 2014లో బిసిలకు 25 వేల కోట్లు, 33% రిజర్వేషన్లు, నిరుద్యోగ యువతకు, కుల వృత్తులకు 2017-2018 నుంచి ఏడేళ్ల నుంచి ఒక్క రుణం కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో బిసిలు అత్యధిక జనాభా, కేసిఆర్ ఏమి చెయ్యలేదని వ్యతిరేకంగా ఉన్నారని, ఓట్లు వేయరు అని భయపడి ఇప్పుడు బిసి బంధు డ్రామాకు తెరలేపారన్నారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ఓట్ల కోసం ఇప్పుడు బీసీలకు లక్ష రూపాయల పేరుతో, కొన్ని కులవృత్తుల వారికే ఇచ్చి బిసిలను విభజించే కుట్ర చేస్తున్నారని, ఇస్తే అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బిసి లను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. నీ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేరన్నారు. బి.సి లకు న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలనీ, బిసిలు అందరూ ఆలోచించి, బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పృథ్విగౌడ్, శ్రీశైలం కుర్మ, నరేందర్ ముదిరాజ్, బుచ్చి రెడ్డి, మనోహర్, లక్ష్మణ్ ముదిరాజ్, మాణిక్ రావు, ఆంజనేయులు సాగర్, రవి, మహేష్, చందు, గణేష్ , రాజు శెట్టి, చంద్ర మౌళి, శ్రీనివాస్ యాదవ్, రాము, విజయేందర్, రామకృష్ణ, శ్రీనివాస్, శ్రీకాంత్, అరుణ్, వివిధ మోర్చ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here