గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నమస్తే శేరిలింగంపల్లి: ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాలు.. లింగంపల్లి తారానగర్ కూరగాయల మార్కెట్ వద్ద రోడ్డుపై సుమారు 35- 40 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. పింక్ కలర్ టీ షర్టు, యాష్ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతడి చేతికి బజరంగ్ రబ్బరు బ్యాండ్ ఉంది. అయితే స్థానికులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే చందానగర్ పోలీసులను సంప్రదించాలని మియాపూర్ ఎస్సై రమేష్ చెప్పారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here