భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయం : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, టీఎన్ నగర్, రెడ్డి కాలనీలలో రూ. 87 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ చొప్పున భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు మంజూరైనట్లు తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్ , డిజిఎం నాగప్రియ, మేనేజర్లు సాయి చరిత, పూర్ణేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here