సీసీ రోడ్డు పనుల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: సీసీ రోడ్డు పనులను నాణ్యతగా నిర్మించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని నెహ్రూ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిసి రోడ్డు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్మించాలని ఆదేశించారు.

సిసి రోడ్డు పనుల విషయంలో రాజీ పడవద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు వెచ్చిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, యాద గౌడ్, గోపాల్ యాదవ్, దివాకర్ రెడ్డి, సత్యనారాయణ, నర్సింహా, బబ్లు, జమ్మయ్య, అలీం, రమేష్, కిషోర్, షరీఫ్, శ్రీకాంత్, పట్లోల నర్సింహ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here