నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని సకుటుంబ సమేతంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అంతేకాక తన నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని వేడుకున్నట్లు శ్రీనివాసుడిని వేడుకున్నట్లు తెలిపారు.