జోరు తగ్గేదేలే..

  • ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్న టీఎస్‌సీఎస్‌
  •  20 ఓవర్లలో 126/8 పరుగులు చేసిన టిఎస్ సిఎస్
  • 9 ఓవర్లలో 44 పరుగులకు కుప్పకూలిన జీహెచ్ ఎంసీ 
  •  సత్తా చాటిన వంశీ మోహన్ రెడ్డి 
  •  50 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సులతో) 50 పరుగులు

నమస్తే శేరిలింగంపల్లి:  టి-20 ఫ్రెండ్‌షిప్ కప్ లో టిఎస్ సిఎస్ జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ విజయ పథాన దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ (టిఎస్ సిఎస్) జట్టు జీహెచ్ ఎంసీ మధ్య పోటీలో చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన టిఎస్ సిఎస్ 20 ఓవర్లలో 126/8 పరుగులు చేసింది. జీహెచ్ ఎంసీ ఫతులగూడ గ్రౌండ్, నాగోల్‌లో జరిగిన మ్యాచ్‌లో టిఎస్ సిఎస్ దే పైచేయి సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన GHMC 9 ఓవర్లలో 44/10 కే కుప్పకూలింది. టీఎస్‌సీఎస్‌కు చెందిన సి.వంశీ మోహన్ రెడ్డి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో మళ్ళీ తన ఫామ్ ను కొనసాగించాడు.

వంశీ మోహన్ రెడ్డి   50 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సులతో) 50 పరుగులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here