‘దళిత బంధు’ దేశానికే ఆదర్శం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : దళితబంధు పథకంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన వికర్ సెక్షన్ కాలనీకి చెందిన దయాకర్ కు స్విఫ్ట్ డిజైర్ కార్ మంజూరైంది. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ఆ కారును లబ్ధిదారుడికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధావుడని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళిత కుటుంబాలలో ఆర్థిక, సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపినవారవుతామని, వారి కాలి పై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు నరేందర్ బల్లా పాల్గొన్నారు.

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుడికి స్విఫ్ట్ డిజైర్ కార్ ను అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here