భారతమాత ముద్దుబిడ్డ.. బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ: ఎంసిపీఐయూ

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలో ఎంసిపీఐయూ పార్టీ నడిగడ్డ తండా కమిటీ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి నిర్వహించి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంసిపిఐయూ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యుడు ఇస్లావత్ దశరత్ నాయక్, పల్లె మురళి మాట్లాడుతూ యావత్ భారతజాతి సగర్వంగా చెప్పుకునే వీరుడు చత్రపతి శివాజీ అని కొనియాడారు.

చత్రపతి శివాజీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎంసిపిఐ యు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్స్ ఇస్లావత్ దశరత్ నాయక్, పల్లె మురళి

చత్రపతి శివాజీ ఆశయ స్ఫూర్తితో బహుజన రాజ్య స్థాపనకు సమాజాభివృద్ధికి అందరూ పాలు పంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంసిపిఐయు జిల్లా కమిటీ సభ్యురాలు దేవనూర్ లక్ష్మి, డివిజన్ నాయకులు దేవనూర్ నర్సింహా, గ్రామ నాయకురాలు గౌసియా బేగం, ముఖేశ్వరి, సురేష్ చౌహన్, రమేష్పవర్, రాజశేఖర్ పటేల్, రూప్లి బాయి, శాంత బాయి, మనీషా బాయి, సంగీత, స్వాతి, నందిని, మీనా విష్ణు చౌహన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here