ఘనంగా శివ పార్వతుల కళ్యాణం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ లో కార్తీక మాసం సందర్భంగా బాలాంజనేయ స్వామి దేవస్థానంలోని భవాని సమేత ఉమామహేశ్వర స్వామి కళ్యాణం అశేష భక్తజనుల మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ ఛార్జ్ గజ్జల యోగానంద్, విచ్చేసి శివపార్వతుల దర్శనం చేసుకొని భవాని సమేత ఉమామహేశ్వర స్వామి ఆశీర్వాదం పొందారు. ఆలయ కమిటీ సభ్యులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

శివ కళ్యాణంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ గజ్జల యోగానంద్
శివ కళ్యాణంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏకాంత్ గౌడ్, విద్యా కల్పన దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here