కులసంఘాల అభ్యున్నతకి కృషి చేస్తాం

  • సామాజిక సేవలో ఎల్లప్పుడూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ముందుంటారు
  • శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చ్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ని కలిసి ప్రభుత్వం తరపున సంఘానికి భవన నిర్మాణానికి స్థలం కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ భూమి ఎక్కడైనా ఉంటే పరిశీలించి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని వివరించారు.

భవన నిర్మాణానికి స్థలం కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కి వినతిపత్రం అందిస్తున్న  ఆర్య వైశ్య సంఘం సభ్యులు

పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ , విదేశాల్లో చదువుకు రూ. 20 లక్షల అందిస్తోందని గుర్తుచేశారు. సమాజం కోసం, సామాజిక సేవలో ఎల్లప్పుడూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ముందుంటారని కొనియాడారు. అనంతరం సంఘం నాయకులు జగదీశ్వర్ గౌడ్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గుప్త, బచ్చు రాజు, వెంకటేష్ గుప్త, సందీప్, విష్ణు, ప్రభాకర్, వజ్ర లింగ గుప్త, పరమేష్ గుప్త, సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్త, ప్రవీణ్ గుప్త, అశోక్ గుప్త, శ్రీధర్ బాబు గుప్త పాల్గొన్నారు.

జగదీశ్వర్ గౌడ్ సత్కరిస్తూ…
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here