జ్ఞానేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా.. గురువారం సంస్మరణ సభ: బీజేపీ

  • నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని నివాళులర్పించాలని పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి.. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆల్విన్ x రోడ్, మియపూర్ మమత ఎస్టేట్స్ వద్ద ఉదయం 11:00గంటలకు సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించవలసిందిగా బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ బృందం కోరింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here