గుర్తుతెలియని వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: సిద్దిఖ్ నగర్ పోచమ్మ గుడి దగ్గర గుర్తుతెలియని వ్యక్తి ఆపస్మారక స్థితిలో పడిపోయిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేటుచేసుకున్నది. మాదాపూర్ పీఎస్ ఎస్ఐ మాల్య నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని డైల్ 100 కు కాల్ చేయడంతో ప్యాట్రోల్ మొబైల్ సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్లి అతడి గురించి ఆరా తీయగా.. గత కొన్ని రోజుల నుండి అదే ఏరియాలో అడుక్కుంటూ పుట్ పాత్ పై నివాసం ఉంటున్నట్లు తెలిసింది. అతడి వయస్సు 65-70 మధ్య ఉంటుందని, మాసిపోయిన బట్టలు, చాక్లేట్ కలర్ యాష్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని పొట్టపై.. ఎడమ చేతి మణికట్టు దగ్గర పుట్టు మచ్చ ఉందని సిబ్బంది తెలిపారు. . చికిత్స నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారని చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ మాల్య నాయక్ తెలిపారు.

అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here