మౌలిక వసతుల కల్పనకు సహకరించాలి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం,శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ శంకరయ్యను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జోనల్ కమిషనర్ శంకరయ్యతో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్, టెలికాంనగర్ లో సీసీ రోడ్డు పరిష్కారానికి మార్గం చూపు వలసిందిగా కోరారు. తదనంతరం టెలికాంనగర్ లో ఉన్న పార్క్ స్థలంలో చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ శంకరయ్యకి వినతి పత్రం అందజేశారు.

జోనల్ కమిషనర్ శంకరయ్యను కలిసి డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందిస్తున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై, కొన‌సాగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. పెండింగులో ఉన్న ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించి త్వ‌రిత గ‌తిన పూర్తయ్యేలా చూడాల‌ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ ను కార్పొరేట‌ర్ కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వెంకన్న, ఏఈ సునీల్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్, నేతాజీ నగర్ కాలనీ ఉప అధ్యక్షులు రాయుడు, సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, దినేష్ టెలికాం నగర్ కాలనీ వాసులు, మొదలగు వారు పాల్గొన్నారు.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తో సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here