మళ్లీ ఎర వేస్తున్నారు

  • అధికారం కోసం బిఆర్ ఎస్ డబల్ బెడ్ రూమ్ ఆశ చూపిస్తున్నది
  • 26వ రోజు రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: డబల్ బెడ్ రూమ్ ఆశ చూపి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నదని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ బాగ్ అమీర్ లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా కరపత్రం పంచి పెడుతూ ప్రచారం చేపట్టారు.

గడప గడపకు బీజీపీ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు అనేక అష్ట, కష్టాలు పడుతున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో మరొకసారి రాష్ట్ర ప్రజలను డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి గద్దెనెక్కాలని చూస్తున్నారని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 50 వేల అప్లికేషన్స్ రాగా మీరు ఇప్పటివరకు ఎన్ని ఇల్లు కట్టారు, ఎంతమందికి ఇచ్చారో లెక్కలు చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నర్సింగ్ రావు కంటెస్టెంట్ కార్పొరేటర్ విద్యా కల్పన, శ్రీహరి యాదవ్, పర్వతాలు యాదవ్, రేపాన్ రాజు, ఏకాంత గౌడ్, గోపాల్ రావు, అశోక్, జితేందర్, లలిత రెడ్డి, మమత, జయశ్రీ, పిట్టల శీను, శాలిని, శృతి, కళ్యాణ్ కుమార్ , సంధ్య, బంటి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here