- సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో పిలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు
- ప్రారంభించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర, డిప్యూటీ కమీషనర్
నమస్తే శేరిలింగంపల్లి: పాదాచారుల భద్రతే ధ్యేయంగా.. రోడ్డు ప్రమాదాల నివారనే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారు. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 44 పిలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అందులో 29 మేడ్చల్ ట్రాఫిక్ జోన్ వద్ద ఉండగా..మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు ఏర్పాటు చేశారు.
వీటిని సైబరాబాద్ లోని మాదాపూర్ వద్ద స్టీఫెన్ రవీంద్ర, ఐపీస్, కమీషనర్ అఫ్ పోలీస్, సైబరాబాద్, మేడ్చల్ ట్రాఫిక్ జోన్ లోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ వద్ద శ్రీనివాసరావు, ఐపీస్, డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్, సైబరాబాద్ ఏకకాలంలో సిగ్నల్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కిరణ్ కుమార్ SHO, అనిల్ కుమార్ RI, సబ్-ఇన్ స్పెక్టర్ సుభాష్, మల్లేశ్వర్ పాల్గొన్నారు. సైబరాబాద్ అంతటా ఏర్పాటు చేసిన పిలికాన్ సిగ్నల్స్ దగ్గర ఇద్దరు ఆపరేటర్స్ ని నియమించి పాదాచారులకు రోడ్డు దాటించనున్నారు.