విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పరీక్ష పే చర్చ: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మసీద్ బండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ ప్రసంగం అనంతరం డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ బహుమతులు అందజేశారు.

పరీక్ష పే చర్చ కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు విద్యార్థులు వేసిన చిత్రాలను, వారి వినూత్న ఆవిష్కరణలను, వారి సృజనాత్మకతను అభినందించడం విధ్యార్ధులతో మాట్లాడటం , వారి ప్రశ్నలకు బదులివ్వడం ఇలా ఎన్నో విషయాలపై సూచనలివ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. గెలుపొందిన వారికి, పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనంత రెడ్డి, కర్చర్ల ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్ , రాధాకృష్ణ యాదవ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, నరసింహ, బాలాజీ, చింతల రాజు, కరణ్, పాల్గొన్నారు.

డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here