సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు.

ఎమ్మెల్యే గాంధీని కలిసి సత్కరించి ఆయనకు తమ సమస్యలు తెలిపిన గోపి నగర్ కాలనీ వాసులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, గోపి నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే కాలనీలలో పర్యటిస్తామని, తన దృష్టికి గాని , కార్పొరేటర్ దృష్టికి గాని తీసుకువచ్చిన ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here