“గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమానికి ఎమ్మెల్యే గాంధీ 20.5 లక్షల విరాళం

తెలంగాణ ఐటీ మంత్రివర్యులు కేటిఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కరోనా వ్యాధిగ్రస్తుల సహాయార్థం గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ 20.5 లక్షల స్వచ్చంద విరాళం అందజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కరోనా అంబులెన్స్ తయారీకి కావాల్సిన డబ్బులకు ఇరవై లక్షల, యాబైవేల రూపాయల చెక్కును శుక్రవారం ప్రగతి భవన్ లోచేవేళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారి సమక్షంలో మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్ల్యే గాంధీ మాట్లాడుతూ ప్రపంచమంతా కరోన వ్యాధి కారణంగా లక్షల మంది బాధపడుతున్నారని వారికి సహాయంగా తన వంతు బాధ్యతను నిర్వర్తించానన్నారు. మంత్రి కెటిఆర్ కరోనా విపత్కర పరిస్థితుల్లో చేసిన మంచి ఆలోచన ఎంతోమంది రోగుల పాలిట వరంగా మారిందని తెలిపారు. భవిష్యత్తులో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో తన కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here