అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటా: ప్రభుత్వ విప్ గాంధీ

భూగర్భ డ్రైనేజి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యల విషయంలో ఎల్లవేళలా నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయం తో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను, శ్రీరామ్ నగర్ బి బ్లాక్ లో 20లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి గాంధీ పరిశీలించారూ. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పనులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్ , తెరాస నాయకులు పొడుగు రాంబాబు,వేణు,రమేష్ తదితరులు పాల్గొన్నారు .

సిసిరోడ్డు పనులను పరిశీలిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here