
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కార్పొరేటర్ వెంకటేశ్గౌడ్ బుధవారం ఆర్థిక సహాయం అందించారు. డివిజన్ పరిధిలోని కెటిఆర్ కాలనీలో నివాసం ఉండే బోయల లాజర్(24) అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకటేశ్గౌడ్ ఆ కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయాని అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస నాయకులు పాల్గొన్నారు.





