చిన్నారులలో సృజనాత్మకతను వెలికితీయాలి : బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో చైర్మన్ మంగళరపు లక్ష్మణ్ చిన్నారుల మెగా సైన్స్ ఎక్సపో ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ విచ్చేసి తిలకించారు.

మెగా సైన్స్ ఎక్స్ పో, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంలో వివిధ వేషధారణలో చిన్నారులు, వారితో బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్

ఈ సందర్బంగా చైర్మన్ మంగళరపు లక్ష్మణ్ కు, ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి కి శుభాభినందనలు తెలిపారు. పిల్లల్లో ఉన్న మేధా శక్తీని వెలికి తీసే ఇలాంటి బహూత్తర కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ సందర్బంగా చిన్నారులు వేసిన సీతారామ కళ్యాణం నాటికను చూసి, పాత్రదారులైన చిన్నారులను అభినందించారు. స్కూల్ చిన్నారులు తయారు చేసిన వివిధ రకాల సైన్స్ & సామాజిక నమూలను చూసి ముచ్చటపడి, చిన్నారుల మేధా శక్తిని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చిన్నారులలో ఆసక్తి పెరిగి, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తే, వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా దోహదం చేస్తాయని అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సీనియర్ నాయకులు కె. నిర్మల, బుడుగు తిరుపతి రెడ్డి, యాదయ్య గౌడ్, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ కాలే బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనలు పరిశీలిస్తున్న ఆదిల్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here