నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్ రావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపీణీ అభినందనీయమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. వినాయకచవితి పర్వదినంను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్ రావు ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రజలకు, కాలనీ వాసులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు ప్రభుత్వవిప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. మట్టి వినాయకుల పంపిణీలో తమదైన పాత్ర పోషించడం పట్ల ఉరిటీ వెంకట్ రావుని ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.