శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ అన్నారు. శంషీగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పేపర్లను ప్రింట్ తీసి ఇవ్వడం ఇబ్బందిగా ఉందని తెలియజేయడంతో కిరణ్ యాదవ్ వెంటనే స్పందించి రెండు ప్రింటర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. స్కూల్కు మాత్రమే కాకుండా విద్యార్థులకు కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ యశ్వంత్, శేరిలింగంపల్లి నియోజవర్గ రాజు అమలవలస తదితరులు పాల్గొన్నారు.