గాంధీజీ అడుగుజాడ‌ల్లో అంద‌రం న‌డ‌వాలి: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్  డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద శుక్ర‌వారం గాంధీ జయంతి వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ విగ్ర‌హానికి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డిలు పూల‌మాలలు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు.

గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి న‌మ‌స్క‌రిస్తున్న‌ ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి

అనంతరం ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. మన జాతి పిత బాపూజీ మహాత్మ గాంధీ 151 వ జయంతి సందర్బంగా శేరిలింగంప‌ల్లిలోని ప్ర‌జ‌లంద‌రికీ గాంధీ జ‌యంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌న్నారు. గాంధీ జ‌యంతి రోజు అహింసా దినోత్సవం అని కూడా గుర్తు చేశారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్ముడు  గాంధీ అని అన్నారు. బ్రిటిష్ వారిని దేశం నుంచి ఆయ‌న అహింసా మార్గంలో తరిమికొట్టార‌ని కొనియాడారు. ఆయ‌న అడుగు జాడ‌ల్లో మ‌న‌మంద‌రం న‌డ‌వాల‌న్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాయ‌కులు

ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, మోహన్ గౌడ్, రాఘవేంద్రరావు , సునీత రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్, ఉరిటి వెంకట్రావు, లక్ష్మా రెడ్డి, ప్రసాద్, దాసరి గోపి, జేరిపాటి రాజు, వెంకటేశ్వర్లు, జనార్దన్ రెడ్డి , రంగరాయ ప్రసాద్, దొంతి శేఖర్, అక్బర్ ఖాన్, రవీందర్ దూబే  తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here