శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమకారుడు, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జి కొండకల్ శంకర్ గౌడ్ 11వ వర్ధంతి సందర్బంగా ఖాజాగూడలోని గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంజమ్మ , రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్, బాలమణి, తాహెర్ , మాధవి , బురాన్ తదితరులు పాల్గొన్నారు.






