కన్నుమూసిన ఎరుపు చుక్కాని – అనారోగ్యంతో ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ మృతి – రేపు మియాపూర్ లో అంత్యక్రియలు

నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. తాండ్ర కుమార్ మరణం కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ఆయా పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు బాగ్ లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ లో ప్రజల దర్శనార్థం కామ్రెడ్ తాండ్ర కుమార్ భౌతిక దేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముజాఫ్ఫర్ నగర్ ఆఫీస్ వద్దకు తీసుకెళ్లను‌న్నారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం అంత్యక్రియలు అయ్యేవరకు మియాపూర్ ని వారి ఇంటి వద్ద మృతదేహం ఉంచబడును.15వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన స్వస్థలమైన మియాపూర్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందిన కామ్రేడ్ తాండ్ర కుమార్ (ఫైల్ ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here