నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతిలో కాలనీలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఐదో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి మార్కెట్ లో పాదయాత్ర నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో ఉన్న చెత్త కుప్పలను, మట్టి దిబ్బలను పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. మార్కెట్లో ప్రతి రోజు ఉత్పన్నం అవుతున్న ట్రాఫిక్ సమస్యలపై అక్కడి దుకాణదారులు, వ్యాపారులతో మాట్లాడి త్వరలో పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

అధికారులతో మాట్లాడి షెడ్ల నిర్మాణం మరమ్మత్తు పనులు వీలైనంత త్వరగా చేయిస్తానని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను అధిగమించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఉంటాయని దీనిపై ఎటువంటి అపోహలకు గురి కావద్దని కొరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, తారనగర్ వార్డు మెంబర్ కవిత, రామచందర్, గోపాల్ యాదవ్, జీహెచ్ఎంసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
