గ‌ణ‌నాథుడికి ర‌వికుమార్ యాద‌వ్ ప్ర‌త్యేక పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు.ఆ గణనాథుడు ప్రతి మనిషి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరారు. హిందూ బంధువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉత్సవం వినాయక చవితి అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు రాజ నాయక్, రంగస్వామి, సురేష్, రాజు, పల్లేపు చంద్రమౌళి, వెంకటేష్, నగేష్, చిన్నా, టింకు, క్రాంతి, శివ, నర్సింగ్ రావు, గణేష్ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు, భక్తులు, బస్తీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వినాయ‌కుడి పూజ‌లో పాల్గొన్న ర‌వికుమార్ యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here