బీరంగూడ (నమస్తే శేరిలింగంపల్లి): బీరంగూడలోని ఇంజినియం వరల్డ్ స్కూల్లో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్సీ పురం కార్పొరేటర్ పుష్ఫ నగేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ఆమె బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సౌజన్య, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

