ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల స్పందన పట్ల ఫడ్నవీస్ ఫిదా: నందకుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను బిజెపి రాష్ట్ర నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ నందకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి రాష్ట్ర రథసారథి బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో వికారాబాద్ చేరుకోగా శనివారం ముఖ్య అతిథిగా ఫడ్నవీస్ పాల్గొన్న విషయం విదితమే. ఈ క్రమంలో బండి సంజయ్ తో కలిసి నంద కుమార్ యాదవ్ ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. యాత్ర తీరుతెన్నులను వారు ఆయనకు వివరించారు. పాదయాత్రలో బిజెపి కార్యకర్తల, స్థానిక ప్రజల స్పందనకి ఫడ్నవీస్ ఫిదా అయిపోయారని నంద కుమార్ యాదవ్ తెలిపారు. వారి రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని అన్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్, బండి సంజయ్ లతో నంద కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here