నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆద్వర్యంలో మహత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏఎంఓహెచ్ డాక్టర్ రవికుమార్, సంఘం నాయకుడు తిప్పర్తి మహేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిరావు పూలే చిత్ర పటానికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెంఉ దశాబ్ధాల క్రితమే అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నగేషప్ప, అజారుద్దీన్, సంతోష్, శ్రీహరి, పరమేష్, అంజి, రామస్వామి, రాణి, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు






